Wednesday, October 31, 2007
aandhra raashtra avatarana - ఆంధ్ర రాష్త్ర అవతరణ
ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, భారతావనికి స్వాతంత్రాన్ని ఇచ్చిన మహనీయులు, ఇవాళ ఉండుంటే, తుచ్చమైన పదవుల కోసం, రాష్త్రాలు కావాలి, అని ఇవాల్టి రోజున కొంతమంది కపట నేతల దౌర్భాగ్యపు స్థితి ని చూసి బాధ పడేవాళ్ళు..ఎందుకంత స్వార్థం? భారతావని మన అందరిది, భారత దేశం లో నేను ఎక్కడికైనా వెళ్ళగలను అన్న నమ్మకం మనలొ కలగాలి కాని,నీది ఆంధ్ర, నాది తెలంగాణా, నీవు నేనున్న చోటికి రావద్దు అనటానికి ఎవరికి ఏమి అధికారాలు ఉన్నాయి?రాష్త్రం మొత్తం మీద వసూలైన డబ్బుల్లలొ, 48.96% తెలంగాణ లొ ఉన్న భాగ్యనగరానికి వెచ్చిస్తుంటే, అప్పుడు ఈ నాయకులు కిమ్మనలేదే? మరి అప్పుడు,ఆంధ్ర , సీమ ప్రాంతాలకు సమానమైన నిష్పత్తిలొ లాభాలు పంచలేదుగా?
ఎవరో వస్తారు, రాష్ట్రం వస్తుంది,అని ఎదురు చూడటం కన్నా, మన ఎదుగుదలకు, మనమే బాట వేసుకుంటే, సమాజం దాని అంతట అదే ఎదుగుతుంది..
ఆంధ్ర రాష్త్ర అవతరణ దినోత్సవాన్ని, బ్లాక్ డే గా అనటం, నిజంగా కన్న తల్లిని అవమానించటమే, అది గుర్తెరిగితే మంచిది...
ఈ నవంబర్ ఒకటో తారీఖున, మన ఆంధ్ర రాష్త్ర అవతరణ దినోత్సవ సందర్భంగా....ఈ బ్లాగ్ రాశాను, ఎవరి మనసుల నైనా నొప్పిస్తే , క్షమించగలరు, కాని మనసు పెట్టి ఆలొచించమని ప్రార్థన...జై తెలుగు తల్లి, జై ఆంధ్ర ప్రదేష్
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ చిరునవ్వులో
సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు ...
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు ...
అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ!
Tuesday, October 30, 2007
jeevitapu samatulyata...జీవితపు సమతుల్యత
జీవితం సాఫీగానే సాగిపొతోంది..చేతనైనంత వరకు పక్క వాళ్ళకి సాయం చేయటానికి ప్రయత్నిస్తున్నా...ఇదేంటీ, సొంత డబ్బా అంటారా..సరే..ఇంకో విషయానికి వద్దాం..
నేను నాతొ పనిచేసే వాళ్ళలో కొంత మందిని చుస్తున్నా, వాళ్ళు, పొద్దున్నే కార్యాలయానికి వస్తారు, రాత్రి పది, పదకొండు అయినా ఇళ్ళకు వెళ్ళరు...ఎందుకంటే, వాళ్ళు త్వరగా సంస్థలో ఎదుగగాలి అని చూస్తున్నారు..
వాళ్ళను చూసి ముందు భయం వేసింది, తర్వాత బాధ వేసింది...భయం ఎందుకు వేసింది అంటే, అమ్మో, వీళ్ళ మధ్యలో మనం పని చెయగలమా..వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే, మనం వీళ్ళతో పోలిస్తే ఎంతా అని.....బాధ ఎందుకు వేసింది అంటే, ఆలొచించగా, నాకు ఇలా అనిపించింది,...
విపరీతంగా కష్టపడి, మనం ఎదిగామే అనుకోండీ, దాని వల్ల మనం పొందింది ఎంటి? సంస్ఠలొ ఎదుగుదల,మరి కొల్పొయింది యేమిటి? మన జీవితంలోని కొన్ని అత్యుత్తమ క్షణాలు...
ఎందుకలా అంటే, ఒక్క సారి ఆలొచిద్దాం..ఇంటి దగ్గర, మనకోసం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, మనతో మాట్లాడదాము అనుకుంటుంది, మనమేమొ అర్థరాత్రి వెళ్తాము..అప్పటికి అమ్మ నిద్ర పోతుంది...
తెల్లవారేక హడావిడి..అమ్మా తొందరగా వెళ్ళలి, మా మేనేజెర్ తో మాట్లాడాలి, అంటూ మన అరుపులు.....అరెయ్ వంశీ నీతొ కొంచం మాట్లాడాలిరా అని అమ్మ అంటుంది.,..మనమేమో రాత్రికి కి వచ్చి మాట్లాడదాము అని వెళ్ళిపోతాము..
మళ్ళీ యధా ప్రకారం రాత్రి ఆలశ్యం..ఇలా కొన్ని రోజులు పోయాక, మనకి, మన ఇంట్ళో వాళ్ళకీ, మాటలు కూడా కరువు అవుతాయి....రెండు సంవత్సరాలు గడుస్తాయి, మనకి సంస్ఠలో ఎదుగుదల వస్తుంది, కాని అప్పటికి, మనం ఆ ఆనందాన్ని పంచుకుందామంటే మనం ఆశించిన రీతిలొ ఇంట్లో వాళ్ళు స్పందించక పోవచ్చు..లేదా అసలు వాళ్ళు లేకపోనూవచ్చు. అప్పుడు మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు..
కావాలంటే మళ్ళీ ప్రొమొషన్ తెచ్చుకోవచ్చు, పోయిన క్షణాలని, అనుభూతులని తెచ్చుకోగలమా?
...మరి ఈ రెండు సంవత్సరాలు వాళ్ళతో మనం గడిపితే, రెండు సంవత్సరాలకి రావల్సిన ప్రొమొషొన్, మూడు సంవత్సరాలకి వస్తుంది..దాని వల్ల, మనకి ఎమన్నా నష్టమా? లేదే? మరి ఎందుకు ఇలా మన జీవితాలను ఆఫిసులకి అంకితం చేసుకుని, మన జీవితాలను మనం మర్చిపొతున్నాం?మనం లేకపోతే పని జరగదూ అనేది వొట్టి మాట,,,
మనం లేనప్పుడూ ఈ సంస్థలు ఉన్నాయి, మనం వెళ్ళిన తర్వాత ఈ సంస్థలు ఉంటాయి...మనం కేవలం సాగే నీరు లాటి వాళ్ళం...మన జీవితమే మనకు ప్రధానం.
పని బాగ చెయ్యాలి, ఎకాగ్రతతో , నమ్మకంగా పని చెయ్యాలి..కాని, మనకోసం ఆలొచిస్తూ ఇంట్ళొ ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళని సుఖబెట్టడం మన ధర్మమని కూడా మనం గుర్తెరిగి ఉండాలి...
ఇట్లు,
భవదీయుడు,
వంశీ కృష్ణ కార్తీక్
Monday, April 16, 2007
Pelli..avasarama.
అసలూ నెనన్నాననీ కాదు కానీండి, పెళ్ళి పెళ్ళి అని మన పెద్దవాళ్ళు వెంట పడుతూ ఉంటారు కదా…అసలు మనకి పెళ్ళి అవసరమంటారా…గురువర్యులు శ్రీ అన్నమాచార్యుల వారు అన్నత్తొ…
వివిధ నిర్బంధముల వెడలదోయక నన్ను
భవసాగరముల దడబడ చేతువ….
అసలే పాపులం…దానికితోడు ఇంకొ పాపి తొ కలిసి కొత్త పాపాలు చేసేందుకు సంసారం అనే ఇంకో నరకం లోకి వెల్లిపొతున్నం….
మరి ఇవన్నీ అనవసరం లేదు అనే అనుకుందాం..
ఆత్మావై పుత్ర నామాసి….అని కూడా మన పెద్దలే అన్నారు…అంటే పిండం పెట్టడానికి ఒక కొడుకు ఉండాలంటారు…పెళ్ళి కాకుండా పిల్లలు ఎక్కడి నించి వస్తారు(ఇంక చాలు ఆలొచనలు ఆపండి)
పొనీ పెళ్ళి వద్దు అనుకుందామా….అగస్త్యుడంతటి వారే..వారి పితృదేవతలకి ఉత్తమగతులు కలగాలని పెళ్ళి చేసుకుని..పుత్రుని కన్నారు కదా..మనమెంత…
అలా అని..బ్రహ్మచారులుగా ఉండి బొలెడంట ఘ్నానన్ని సంపాదించిన, తాతగారు నారదుల వారు లెరా…వారితొ మనకి పొలికేమిటి లేండి.. అంత మాత్రనికి పెళ్ళి చెసుకొవాలని లేదు…అసలు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎవరో ఒకరు మనల్ని ఎదో ఒక రకంగా శాశిస్తూనే ఉంటారు..ఎదొ ఒక ఉద్యొగం వచ్చాక..మన కార్యాలయాల్లొ ఎలా ఉన్న..ఇంట్లో కాస్త పరిస్తితి మెరుగు పడుతుంది…మళ్ళి వెంటనే పెళ్ళి అంటారు…
జీవితం మొత్తం శాసించే ఒక వ్యక్తిని పని గట్టుకుని ఆహ్వానించాలా?
ఏ కాటికి..అమ్మాయి అత్తగారింటికి వస్తుంది..పాపం ఎలా ఉంటుందో ఎమిటో..అబ్బాయి సరిగ్గ చుసుకుంటాదో లేదో అనే కాని..అబ్బాయి మంచి వాడే..ఈ అమ్మయి అతన్ని అర్థం చేసుకుంటుందో లెదో..అత్తగారిని బాగా చూసుకుంతుందో లెదో అని ఓక్కరూ ఆలొచించరు….పైగా అత్తగారేదో కొడలి మీద పెత్తనం చెలాయిస్తొందంటూ పుకార్లు పుట్టిస్తారు…
ఎవండొఇ..నాకు ఇంకా పెళ్ళి కాలేదు..నాకేమిటి మా అన్నయ్యకే కాలెదు..ఎదొ ఊసుపొక ఇలా ఉన్న అక్కసంతా కక్కెసా…. ఈంక చాలు లెండి..ఉంటా
ఇంతకీ నేను చెప్పదలుచుకుందెంతంటే ---- వివాహం విద్య నాశాయ…ఆ తర్వాత నేను చెప్పను..
Monday, April 9, 2007
ఆలోచనలు
ఆలోచనల మూలం ఎమిటా అని ఆలోచిస్తున్నా…అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నా..ఇంతకి మూలం దొరికిందా అంటే….దొరికిందనే చెప్పాలి….
సృష్తి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఆలోచనలకన్నిటికి మూలము
అందుకే అన్నమాచార్యుల వారు అంటారు…
చిత్తములొ భావమెల్ల శ్రీ వేంకటేశుడే
తక్కిన ప్రకృతి యల్ల ఆతని మాయే
మిక్కిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
ఇట్టి దేహపు బ్రతుకు బ్రతికేటి వారికి ...
ఎంత చక్కగా చెప్పారండి....మన ఆలోచనల భావం ఆ శ్రీ వెంకటేశుడెనట....ఇక మిగిలిన ఈ భూప్రపంచం లొని ప్రానులంతా ఆతను కల్పించిన మాయె....
ఈ ఒక్క ఫాట చాలాదా...ఇంకో కీర్తనలో,
భావములొన బాహ్యము నందున..
గొవింద గొవింద అని కొలువవో మనస....
మనం మన భావములొను..అంటే ధ్యాన ప్రపంచం లోనూ అలానే ఈ బాహ్య ప్రపంచం లోనూ…ఆ గొవింద నామమే జపిస్తూ ఉందలి…. అలా జపించినప్పుడే మనకి
పైన చెప్పినట్టుగా...ఆ ఆలొచనల భావం ఆ శ్రీవేంకటేసుడే అని అర్థం అవుతుంది,,,
ఇదెమిట్రా వీడు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు అనుకున్నరా...ఏదో అన్నమాచార్య కీర్తనల మీద మక్కువ తొ ఇలా ఉదహరణ సహితంగా రాద్దామని అనిపించింది(ఇక్కడెమి ఉదహరణ ఇవ్వలేదు..వెతకకండీ)...
ఇట్లు భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్
Friday, March 30, 2007
Nenu naa Jeevitam
స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అన్నారు పెద్దలు....వీడేమిటిరా ఇలా మొదలెట్టాడు అనుకుంటున్నరేమో...నేను కూడా ఇంత కాలం 'యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రవంతి దెవతా' అనుకున్న వాడినే......మరిప్పుడెమైంది అంటారా…ఎమొ..ఎందుకొ గడచిన కొన్ని రొజులుగా ఇదె అనిపిస్తొంది…అంత బాధ పడుటూ వాళ్ళ గురించి ఎందుకులేండి…మగ మహరజులం మనం ఉన్నాం కదా…ఎమంటారు?…
సరే ఇక నేను, నాలో చెప్పుగొదగ్గ గొప్ప విషయలేమి లేవు..ఏదొ సాద సీద మనిషిని….పేరు వంశీ కృష్ణ కార్తీకు….ఉండేది భాగ్యనగరంలొ(అభాగ్యమేమో) చేసేది సోఫ్త్ వేరు ఈంజినీర్ అనే కొత్త పేరు పెట్టిన టైపిస్టు ఉద్యొగం….ఇంకా సహధర్మ చారిని రాలేదు..బహుశా అందుకెనెమో మొదటి పేర లొ అలా రాసాను…అయ్యుంటే నన్నీపాటికి చంపేయదూ :) ..
భగవంతుడు అనే వాడున్నాడని నమ్మే వాడిని నేను..అయన నాకిచ్చిన అతి పెద్ద వరం…మా అమ్మ, నాన్నగారు…మళ్ళీ జన్మంటు ఉంటే వీరికె పుట్టాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నను..అదే విధంగా వేరే జన్మ ఉండగూదదని కుడా కొరుకుంటున్నను…
ఏదొ అంటారు..సృష్తిలొ తీయమైనది స్నేహమేనొయి అని….ఏమో నాకైతే తీపి కన్న చేదు అనుభవాలే ఎక్కువ ఉన్నాయ్….బహుసా అది నాలొనే ఎదైన లొపం అయుందచ్చు…ఆది తెలియాలంటే నా స్నెహితులు నాతొ ఆ ముక్క చెప్పేస్తె మారటానికి నాకు ఆస్కారం ఉంతుంది…మర్పు కావలండొయ్…
ఇకపొతె నా అభిరుచులు…రుచిగా ఉండె పదార్థాలన్ని తినటం నా అభిరుచి…నా గొంతు బండగా ఉండేది(ఇంక ఉందండొయ్)..అందుకని చిన్నప్పుడు నాకు సంగీతం నెర్పాలంటే మా మష్తారు భయపడిపొయారు… సంగీతం ఐతే రాలేదు కానీ ఆ భగవంతుడి కృపా కటాక్ష వీక్షణం వల్ల…కీర్తనలను పాడగలుగుతున్న(ఇప్పటికీ గాన గార్ధబన్నే లేండి)…
ఫ్రస్తుతానికైతే వొంటరిని…ఎప్పటికైనా వొంటరినె లేండి..కాకపొతే ఎదో ఎవరో వస్తారనే చిన్న ఆశ....
ఇంత సేపు నా సొల్లు ఎవరూ చదివి ఉండరు...చదివిన వాళ్ళకి కృతగ్నతలు....
ఇట్లు విధేయుడు
వంశీ కృష్ణ కార్తీకు
Thursday, March 29, 2007
Gurur brahma Gurur Vishnuhu..
శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్యా
పీత్వాపినై వసుహితామ్ మనుజాభవేయు:
త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే
భాగవతం లొ ఒక చొట శుక మహర్షి చెప్తారు..ఎవరి గురించి లోకంలొని జనులు మంచి చెప్పుకుంటారొ అంత కాలం వారు వైకుంఠ వాసులై ఉంటారు...ఎప్పుడైతె ప్రజలు వారిగురించి మర్చిపొతారొ అప్పుడు వారికి పునర్జన్మ వస్తుంది అని...అయితే అన్నమాచర్యుల వారి కీర్తి ఎటువంటిదంటే కొన్ని వేల సంవత్సరాలు ఇంకా చెప్పలంటే తెలుగు బాష ఉన్నంత కాలం ఆయన కీర్తి అత్యున్నత స్థాయిలొ నిలిచి ఉంటుంది
Website'>http://www.easycounter.com/FreeCounter3.html">Website Hit Counter